తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్కు తన నియోజకవర్గం కుప్పం బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శ్రీకాంత్ సంచలన విజయం సాధించారు. తన విజయాన్ని గుర్తించి తన నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. 38 మంది పార్టీ సభ్యులతో ఏర్పాటైన కుప్పం నియోజకవర్గ ఎన్నికల కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు కనీసం లక్ష ఓట్ల మెజారిటీ సాధించడమే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తోంది. కంచర్ల శ్రీకాంత్ ఇప్పటికే కుప్పంలో పర్యటిస్తున్నారు. వారంలో మూడు రోజులు కుప్పంలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు.