స్టాక్ మార్కెట్లు నేడు నాలుగో రోజు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 349 పాయింట్లు లాభపడి 60,649 వద్ద ముగిసింది. నిఫ్టీ 101 పాయింట్లు పెరిగి 17,915 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : బజాజ్ ఫైనాన్స్ (2.39%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.90%), భారతీ ఎయిర్టెల్ (1.62%), ఇన్ఫోసిస్ (1.55%), కోటక్ బ్యాంక్ (1.37%).
టాప్ లూజర్స్ : హిందుస్థాన్ యూనిలీవర్ (-1.46%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.13%), యాక్సిస్ బ్యాంక్ (-0.76%), TCS (-0.39%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.24%).