పద్నాలుగు ఏళ్ల బాలికను లైంగికంగా వేధించడంతోపాటు ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో వ్యాపారి వినోద్జైన్కు విజయవాడ పోక్సో కోర్టు జీవిత ఖైదు విధించింది. నేరం రుజువుకావడంతో పోక్సో న్యాయ మూర్తి ఎస్.రజని బుధవారం తీర్పును వెలువరించారు. వినోద్జైన్ వేధింపులు భరించలేక తొమ్మిదో తరగతి చదివే 14 ఏళ్ల బాలిక భవానీపురంలోని లోటస్ అపార్ట్ మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి 2022 జనవరి 30న ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో ఐపీసీ 305 సెక్షన్ కింద వినోద్జైన్కు జీవిత ఖైదు విధించారు. పోక్సో చట్టంలోని 9, 10 సెక్షన్ల కింద ఏడేళ్ల జైలుశిక్ష విధించారు. పోక్సో చట్టంలోని 9, 10, 12 ప్రకారం రూ.50 వేలు, ఐపీసీ 305, 354 కింద రూ.2 లక్షలు, ఐపీసీ 509 కింద రూ.50 వేలు మొత్తం రూ.3 లక్షల జరిమానా విధించారు. ఈ జరిమానా నుంచి రూ.2.40 లక్షలను మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేయాలని ఆదేశించారు. కేసులో 25 మంది సాక్షులను విచారిం చారు. మృతురాలి తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుజ్జుల నాగిరెడ్డి వాదనలు వినిపించారు. భవానీపురంలోని లోటస్ అపార్ట్మెంట్లో వినోద్ జైన్ కుటుంబం నివసిస్తోంది. అదే అపార్టుమెంట్లో ఉంటున్న బాలికపై అతడు కన్నేశాడు. లిఫ్ట్ ఎక్కేట ప్పుడు, దిగేటప్పుడు బాలికతో సరదాగా మాట్లాడుతూనే అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. వినోద్జైన్ చేష్టలకు బాలిక విసిగిపోయుంది. 2022 జూన్ 30న ఉదయం నుంచి బాలిక కుటుంబ సభ్యులకు ముభావంగా కనిపించింది. ఆ రోజు సాయంత్రం బాలిక తాతయ్య, తల్లి వాకింగ్కు బయలుదేరారు. ఆ సమయానికి బాలిక పాఠశాల నుంచి ఇంటికి వచ్చింది. వాకింగ్కు వెళ్తున్న తల్లిని ఒక్కసారిగా కౌగిలించుకుంది. తర్వాత తల్లి, తాతయ్య వాకింగ్కు వెళ్లారు. వారు తిరిగి వచ్చేసరికి బాలిక ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసు కుంది. ఏసీపీ డాక్టర్ కె.హనుమంతరావు, భవానీపురం పోలీసులు బాలిక గదిలో గాలించగా ఆమె రాసిన మూడు పేజీల లేఖ లభించింది. వినోద్ జైన్ తనను ఎలా వేధించాడో ఇంగ్లీష్లో స్పష్టంగా రాసింది. తన జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు పేర్కొంది. భవానీ పురం పోలీసులు క్రైం నంబర్ 50/2022తో కేసు నమో దు చేశారు. వినోద్ జైన్ను అరెస్టు చేసి విజయవాడ లోని జిల్లా జైలుకు పంపారు. అప్పటి నుంచి తీర్పు వచ్చే వరకు ట్రయల్ ప్రిజనర్గా జైల్లో ఉన్నారు.