పుంగనూరు పట్టణ మరియు మండల నియోజకవర్గ ప్రజలందరూ కూడా వేసవికాలంలో అప్రమత్తంగా ఉండాలని బుధవారం పట్టణంలోని పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ మధుసూదన్ రెడ్డి తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి టెర్రస్ పై పడుకునే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బయట ప్రాంతాలకు వెళ్లే ప్రజలు పోలీసులకు సమాచారం అందిస్తే వారి ఇంటి దగ్గర దొంగతనాలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు