ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మిగనూరులో విద్యుత్ సరఫరా కు అంతరాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 26, 2023, 03:11 PM

కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరులో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఒక వైపు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు మరోవైపు మెరుపు స్థాయిలో వర్షం. వాతావరణంలో చోటు చేసుకున్న అనూహ్య మార్పులు. రైతన్నలను కంటతడి పెట్టిస్తున్నాయి. పలుచోట్ల రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట నీటిపాలైంది. వేల రూపాయలు పెట్టుబడి వర్షార్పణమైంది. బుధువారం తెల్లవారుజామున రెండు గంటలకు ఎన్నడూ లేని విధంగా అతి భారీ శబ్ధంతో ఉరుములు, మెరుపులతో కుంభవృష్టి కురిసింది. దీంతో 11సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. గంటన్నర సేపు కురిసిన భారీ వర్షానికి ప్రజలు ఇంట్లో ఉండి ఉరుములు, మెరుపుల శబ్ధానికి భయాందోళనకు గురయ్యారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గుడికల్ చెరువు పొంగి పొర్లడంతో పొలాల్లోకి నీరు చేరింది. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలో విత్తనాలు తడిసిముద్దయ్యాయి. భారీ వర్షం తాకిడికి పట్టణంలో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రోడ్లన్నీ జలమయ్యాయి. శిల్పాకాలనీలో గల సాయినగర్, రిలయెన్స్ పెట్రోల్ బంక్, మునెప్ప నగర్, ధోభి ఘాట్, శివన్ననగర్, మాలగేరి, సోలార్ పంప్ హౌస్, బుడగ జంగాల కాలనీ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com