ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన బీటెక్ విద్యార్థి శశిధర్ రెడ్డి ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను కలిశారు. ఈనెల 24వ తేదీన ముంబాయిలోని సచిన్ నివాసం వద్ద యాభై వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. అందులో భాగంగా దేశవ్యాప్తంగా 50 మందికి సచిన్ ని కలవడానికి ఆహ్వానం పంపారు. తెలంగాణ నుంచి నలుగురిని ఏపీ నుంచి మార్కాపురం వాసి సచిన్ వీరాభిమాని శశిధర్ రెడ్డికి ఆహ్వానం మేరకు ఆయనను కలిశారు.