ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దొనకొండ మండలంలోని వేంచేసి ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి తిరుణాల మహోత్సవం మంగళవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య తిధిగా దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పాల్గొన్నారు. అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రభా ప్రాంగణంలో ఆయన ప్రసంగించారు. కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.