అనంతపురం జిల్లా నార్పల లో జరుగుతున్న సీఎం పర్యటనకు సీఎం ను కలవడానికివెళ్తున్న ధర్మవరం చేనేత కార్మిక సంఘం నాయకులు, సిపిఐ, సిపిఎం, నాయకులను ధర్మవరం పట్టణ పోలీసులు బుధవారం అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా చేనేత కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ అరెస్టులు చేసి ప్రజా ఉద్యమాల గొంతు నొక్కలేరని చేనేత కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు మా ఉద్యమాలు కొనసాగిస్తామని అన్నారు. ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింక చలపతి, సిపిఐ, పట్టణ కార్యదర్శి రవికుమార్, ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు, పోలా రామాంజనేయులు, సిపిఎం పట్టణ కార్యదర్శి పెద్దన్న లను అరెస్ట్ చేశారు.