గుట్టచప్పుడు కాకుండా గంజాయిని తీసుకు వచ్చిన ముగ్గురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు బుదవారం అదుపులోకి తీసుకున్నారు.కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం సాయంత్రం కప్పరాడ ప్రాంతం ఇంద్రనగర్ లో పశ్చిమ బెంగాలు చెందిన ఇద్దరు వ్యక్తులు మహమ్మద్ అజ్మిల్ హక్, సాదికుల్ ఇస్లాం అనే వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా 60 కేజీల గంజాయిని ఒక ఇంట్లో ఉంచారనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్స్ చేసి పట్టుకున్నారు. వారివద్ద నుండి 60 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని, వారిని కంచరపాలెం పోలీసులకు అప్పగించారు. ఇదిలా ఉండగ ఘటనలో మరో వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని కంచరపాలెం పోలీసు లకు అప్పగించారు. ప్రస్తుతం అతడిని కంచరపాలెం పోలీసు లు విచారిస్తున్నారు. సిఐ ఎస్ విజయ్ కుమార్ నేతృత్వంలో కేసు దర్యాప్తు చేపట్టారు.