ఇటీవల అందుబాటులోకి వచ్చిన అదానీ ఎంటర్ప్రైజెస్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పిఓ)పై అదానీ గ్రూప్ యూటర్న్ తీసుకుంది. రూ.20 వేల కోట్ల విలువైన ఈఎఫ్పీఓకు భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే సబ్ స్క్రైబర్లను దృష్టిలో ఉంచుకుని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎఫ్ పీవో కోసం బిడ్ దాఖలు చేసిన వారందరికీ రిఫండ్ చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.