మధ్యప్రదేశ్ గ్వాలియర్ ట్రేడ్ ఫెయిర్లో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో నాలుగు దుకాణాలు బూడిదగా మారాయని పోలీసు అధికారి తెలిపారు. సమాచారం అందుకున్న దాదాపు అరడజను అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు, అయితే సుమారు రూ.40 లక్షల విలువైన వస్తువులు దగ్ధమయ్యాయి.ఈ విషయంపై చర్యలు తీసుకుని అగ్నిమాపక దళ బృందం సహాయంతో మంటలను అదుపు చేశారు.