జెరూసలేం లోని ఒక ప్రార్థన మందిరంలో జరిగిన ఉగ్రదాడిలో 8 మంది ఇజ్రాయెలీలు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఈ ఘటన అనంతరం పాలస్తీనియన్లు సంబరాలు చేసుకున్నారు. తూర్పు జెరూసలేంలో పాలస్తీనియన్లు భారీ ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.