ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రజలు సహకరించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 01:56 PM

ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రజలు సహకరించాలని గజపతినగరం ఎంపీపీ బెల్లాన జ్ఞాన దీపిక, జడ్పిటిసి గార తవుడులు కోరారు. గురువారం ప్లాస్టిక్ నిషేధం పై గజపతినగరం, పురిటిపెంట పంచాయతీలు సంయుక్తంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా పలు నినాదాలు ఇస్తూ అవగాహన ర్యాలీ జరిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కొవ్వాడ కిషోర్ కుమార్, గజపతినగరం, పురిటిపెంట గ్రామ సర్పంచులు నరవ కొండమ్మ, ఎస్. విజయలక్ష్మి, ఉప సర్పంచులు కర్రి రామునాయుడు, మండల సురేష్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మండల పంచాయతీ విస్తరణాధికారి డి. జనార్దనరావు, పంచాయతీ కార్య నిర్వహణ అధికారులు మంత్రి రమణ, జి. జనార్దనరావు, వైసిపి నాయకులు పల్లి సంజీవరావు, రేగ సురేష్, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com