అమరావతికి తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని, వికేంద్రీకరణతోనే రాష్ట్రమంతా అభివృద్ధి జరుగుతుందని మంత్రి బొత్స అన్నారు. విశాఖలో పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. రాజధాని ప్రతిపాదన ఇచ్చిన సంస్థకు కోట్ల రూపాయల ఫీజు ఇచ్చారని, అక్కడ నిర్మాణ ఖర్చు చాలా ఎక్కువ అవుతుందని, విశాఖలో తక్కువ అవుతుందని చెప్పారు. అమరావతిలో అంత ఖర్చు అవసరమా అని తాము ఆలోచన చేశామని తెలిపారు.