ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సౌండ్ సిస్టం సినిమా థియేటర్ పై....పవన్ అభిమానుల దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 01, 2022, 08:21 PM

అభిమాన హీరో చిత్ర ప్రదర్శనలో ఏమైన ఎక్కువతక్కువ అయితే అభిమానుల తిరుగుబాటు ఎలా ఉంటుందో కర్నూలోని ఓ థియేటర్ లో తెలిసింది. టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు గురువారం క‌ర్నూలులోని శ్రీరామ టాకీస్‌పై దాడికి దిగారు. ఈ దాడిలో థియేట‌ర్ అద్దాలు ధ్వంస‌మయ్యాయి. ఈ ఘ‌ట‌న‌తో థియేట‌ర్ వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. శుక్ర‌వారం ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఓ రోజు ముందుగానే ఆయ‌న న‌టించిన పాత చిత్రం జ‌ల్సాను మ‌రోమారు విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.


ఈ సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌లో భాగంగా శ్రీరామ థియేట‌ర్‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ భారీ ఎత్తున త‌ర‌లివచ్చారు. సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌లో భాగంగా థియేట‌ర్‌లో సౌండ్ సిస్ట‌మ్ స‌రిగా లేద‌ని ప‌వ‌న్ అభిమానులు ఆందోళ‌న‌కు దిగారు. ఈ క్ర‌మంలో థియేట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చిన ఫ్యాన్స్ రాళ్ల‌తో థియేట‌ర్‌పైకి దాడికి దిగారు. ఈ దాడిలో థియేట‌ర్ పాక్షికంగా ధ్వంస‌మైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com