ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనంతగిరిలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 07:15 PM

రైతులకు ఇవ్వాల్సిన వర్షాకాల రైతు భరోసా ఎగ్గోట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు నిరసనగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశానుసారం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రంలో ఉన్న ఎన్టీఆర్ చౌరస్తా వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు నల్లా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.... రైతులకు రైతుబంధు వెంటనే అమలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలం చెందిందని, సంవత్సరానికి 15వేలు రైతుబంధు ఇస్తామని అబద్ధపు ప్రచారలతో హామీలు ఇచ్చి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అనంతగిరి మండలంలో వరద ప్రభావిత గ్రామాలకు నష్టపరిహారం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, వరద బాధితులకు వెంటనే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గూగులోతు శ్రీనివాస్, సమన్యయ కమిటీ సభ్యులు పందిరి వీరయ్య, ఐతనబోయిన వెంకటేశ్వర్లు, బానోతు ప్రసాద్, ఎస్టీ సెల్ అధ్యక్షులు భూక్యా బోస్, ప్రచార కార్యదర్శి ఎస్డి సైదా, బెల్లంకొండ ఏడుకొండలు, రాజా  మోహన్ రెడ్డి, లచ్చిరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మన్నె హరీష్, పాపిరెడ్డి, సుంకర బిక్షం, రవి, హాసన్, చార్లెస్, నాగేశ్వరరావు, కమల్, యాకూబ్ పాషా ,రామారావు, సైదులు, తులసిరామ్, అవినాష్, అజ్మీర శ్రీను, కస్సు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com