మండలం లోని పెద్ద గుండావెల్లి గ్రామానికి చెందిన బాలయ్య వృత్తి వ్యవసాయం అనే వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దుబ్బాక ఎస్ఐ గంగరాజు తెలిపిన వివరాలు ప్రకారం.. గత కొంత కాలంగా ఆస్థి పంపకాల విషయం లో గొడవలు జరుగుతున్నాయని, తన ఆస్థి తనకు రిజిస్ట్రేషన్ చేయమని తన కన్న వాళ్ళను అడగగ పెద్ద మనుషుల సమక్షంలో రిజిస్ట్రేషన్ చేసుకొమ్మని చెప్పగా నాకు ఇప్పుడే కావాలని పట్టుబట్టి క్షనికవేషంలో ఇంట్లో గడ్డి మందు తాగి తీవ్రంగా అస్వస్థతకు గురయ్యాడని తెలిపారు .
ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు చుట్టూ పక్కల వారు హుటాహుటిన సిద్దిపేట జిల్లాప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడిభార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దుబ్బాక ఎస్ఐ గంగరాజు తెలిపారు.