ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇస్‌-సానిటరీ లెట్రిన్‌ లేని జిల్లాగా తూర్పుగోదావరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 12, 2024, 10:34 PM

తూర్పుగోదావరి జిల్లాను మాన్యువల్‌ స్కావెంజర్స్‌, అపరిశుభ్రమైన మరుగుదొడ్లు(ఇస్‌-శానిటరీ లెట్రిన్‌) లేని జిల్లాగా ప్రకటించినట్టు కలెక్టర్‌ పి.ప్ర శాంతి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సుప్రీంకోర్టు ఆదే శాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 300 గ్రామ పంచాయ తీలు, రాజమహేంద్రవరం కార్పొరేషన్‌, కొవ్వూరు, నిడదవోలు మునిపిపాలిటీల పరిధిలో సర్వే నిర్వహించినట్టు చెప్పారు.


ఈ సర్వేలో జిల్లాలో మాన్యువల్‌ స్కావెంజర్స్‌ ఎవ్వరూ లేరని, అపరిశుభ్రమైన మరుగుదొడ్లు లేవని జిల్లా పంచాయతీ కార్యాలయం, కార్పొరేషన్‌, మునిసిపల్‌ కార్యాలయాల నుంచి నివేదికలు అందాయన్నారు. వాటి ఆధారంగా మాన్యువల్‌ స్కావెంజర్స్‌ ఫ్రీ, అపరిశుభ్రమైన మరుగుదొడ్లు లేని జిల్లాగా ప్రకటించినట్టు చెప్పారు. ఈ విషయమై ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 24లోపు సంబంధిత మునిసిపాలిటీ/మండల పరిషత్‌ అధికారుల ద్వారా మీ వివరాలు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమ, సాధికారత కార్యాలయం, రాజమహేంద్రవరం ఆర్డీవో కార్యాలయంలో తెలియజేయాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com