ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుర్గమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 12, 2024, 10:44 PM

"జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే అంటూ ఆ పరమేశ్వరిని హైందవులంతా కొలిచే నవరాత్రులు ముగింపుగా ప్రవేశిస్తున్న విజయ దశమి పర్వదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అని జనసేన అధినేత పవన్ కల్యాణ తెలిపారు. భారతదేశం నలుమూలలా భక్తులు విశేష భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ శరన్నవరాత్రులను ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక వేడుకగా చెప్పుకోవచ్చు. ఊరు, వాడలంతా అమ్మవారి సంబరాలతో భక్తి భావం ఉట్టిపడుతోంది.


ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయం కిక్కిరిసి భక్తులతో అలరారుతోంది. ఈ నవరాత్రులలో దుర్గమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ విజయదశమి ప్రజలందరికీ విజయాలు చేకూర్చాలని, తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా విరాజిల్లాలని శక్తి స్వరూపిణిని ప్రార్థిస్తున్నాను" అని ట్వీట్ చేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com