ఇందిరా మహిళాశక్తితో పథకంతో మహిళలు ఆర్థికంగా ప్రగతికి దోహదపడుతుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. ఇందిరా మహిళాశక్తి పథకంలో భాగంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని మెడికల్ కళాశాలలో తంగళ్ళపల్లికి చెందిన మార్కండేయ మహిళా సమాఖ్యకు రూ. మూడు లక్షల రుణం మంజూరు కాగా, ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్ ను ఏర్పాటు చేశారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించగా ముఖ్య అతిథిగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. మహిళలు కలిసికట్టుగా స్థానిక ఆహార పదార్థాలు నాణ్యతతో అందజేయాలని కలెక్టర్ సూచించారు. పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ఆర్థికంగా ప్రగతి సాధించి మిగతా సంఘాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ శేషాద్రి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మి నారాయణ, అదనపు డీఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సరిత, డీపీఎంలు సంధ్యారాణి, పద్మయ్య తదితరులు పాల్గొన్నారు.