సిరిసిల్ల పట్టణంలో కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ సైన్స్) గా పనిచేస్తున్న పాకాల శంకర్ గౌడ్ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు స్వీకరించిన సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అభినందించారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో మంత్రుల నుంచి పాకాల శంకర్ గౌడ్ అవార్డు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మంగళవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ ను కలువగా, టీచర్ ను కలెక్టర్ సన్మానించి, ఆయన విద్యార్థులకు అందిస్తున్న సేవలను ప్రశంసించారు.
సైన్స్ లో ప్రయోగాలు సైన్సు ఉపాధ్యాయుడుగా విద్యార్థులతో ప్రయోగాలు చేయిస్తూ సైన్స్ ఎగ్జిబిషన్లో, ఇన్స్పైర్ అవార్డులలో, అటల్ టింకరింగ్ లాబ్ నిర్వాహణలో అత్యున్నత ప్రతిభ కనబరిచారు. తను గైడ్ టీచర్ గా తయారు చేసిన పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మిషన్ 2022-23 సంవత్సరానికి ఇన్స్పైర్ మానాక్ జాతీయస్థాయి ప్రదర్శనకు ఎంపికై పలువురు మనల్ని పొందింది. ఈ నెలలో డిల్లీ ప్రదర్శనలో పాల్గొననుంది. గతంలో మూడు సార్లు ఇన్స్పైర్ మానక్ రాష్ట్ర స్థాయికి, జె.ఎన్.ఎం.ఎస్.ఎస్. సైన్స్ ఎగ్జిబిషన్ లో రెండు సార్లు రాష్ట్ర స్థాయికి తను గైడ్ టీచర్ గా ప్రాజెక్ట్ లు ఎంపిక అయ్యాయి. విద్యార్థి పరిపూర్ణుడుగా రూపొందాలంటే అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని ఉద్దేశంతో సహా పాఠ్య కార్యక్రమాలు, బోధనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ ప్రశంసలందుకున్నారు. టీచర్ శంకర్ గౌడ్ ను పలువురు అభినందించారు.