ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గా నియమితులైన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి శేరిలింగంపల్లి నియోజక వర్గ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం ఈ శుభసందర్బంగా కార్పొరేటర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వివేకానందనగర్ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పూలబొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
శుభాకాంక్షలు తెలిపిన వారిలో మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, . హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు, మాజీ కౌన్సిలర్లు రవీందర్ రావు , మోహన్ గౌడ్ , మిరియాల రాఘవరావు, తదితరులు ఉన్నారు.