దేవరకొండపట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అర్హులైన 10మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి&షాది ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పేదింటి ఆడబిడ్డలకు పెళ్ళికి వరంగా మారిందన్నారు. దేశంలోనే ఈ పథకం ఆదర్శంగా నిలిచిందన్నారు.
ఈ కార్యక్రమంలో దేవరకొండ తహసీల్దార్ సంతోష్ కిరణ్ కుమార్,మండల పార్టీ అధ్యక్షులు లోకాసాని శ్రీధర్ రెడ్డి,మాజి ఎంపీపీ జాని యాదవ్,మాజి మున్సిపల్ చైర్మన్ దేవేందర్ నాయక్,మాజి పట్టణ సర్పంచ్ పున్న వేంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు హన్మంతు వెంకటేష్ గౌడ్,కౌన్సిలర్ సైదులు,యువజన నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ,రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొర్ర రాంసింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.