రేపు ముత్తారం మండలంలోని అడవిశ్రీరాంపూర్ గ్రామంలో జరిగే వైద్య శిబిరాన్ని గ్రామస్తులు వినియోగించుకోవాలని ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ గ్రామ మాజీ ఎంపిటిసి గీతారాణి లు తెలిపారు.గ్రామంలో విష జ్వరాలు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా గురువారం వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ముత్తారం మండల ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ అమరేందర్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించబడుతుందని ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వైద్య పరీక్షలు చేసి తగు మందులు ఇస్తారని తెలిపారు. శుక్రవారం వృద్ధాప్య వైద్య శిబిరం. అడవిశ్రీరాంపూర్ గ్రామంలో శుక్రవారం ఆయుష్ శాఖ (హోమియో) డాక్టర్ అరుణ ఆధ్వర్యంలో వృద్ధాప్య వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ అవకాశాన్ని అడవిశ్రీరాంపూర్ గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని దొడ్డ బాలాజీ గీతారాణి లు తెలిపారు.