మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం గవ్వలపల్లి చౌరస్తా వద్ద మద్యం షాపులో గత రాత్రి చోరీ జరిగింది. రేణుక మాత మద్యం షాపులో అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు తాళాలు ధ్వంసం చేసి లోపలికి వెళ్లారు. షాప్ లో ఉన్న రూ. 50 వేల నగదు, ఆరు మద్యం ఫుల్ బాటిల్స్, రెండు బీర్లు ఎత్తుకెళ్లినట్లు షాపు యజమాని పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.