పద్మశ్రీ అవార్డు గ్రహీత కూరెళ్ల విఠలాచార్యకు శిష్యుడినికావడం అదృష్టంగా భావిస్తున్నానని హైకోర్టు న్యాయమూర్తి కూనూరు లక్ష్మణ్ అన్నారు. తన ఇంటినే గ్రంథాలయంగా మార్చిన విఠలాచార్య 2. 15 లక్షల పుస్తకాలను సేకరించారని తెలిపారు.
నల్లగొండలో కూరెళ్ల విఠలాచార్యకు ఆదివారం పౌరసన్మానం జరిగింది. ఈసందర్భంగా మాట్లాడుతూ కూరెళ్ల 1954లోనే గ్రంథాలయం ఏర్పాటుచేసి దానికి శంభులింగేశ్వర అని నామకరణం చేశారని గుర్తు చేశారు.