జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చెకల్ల గ్రామ శివారు వాగు బ్రిడ్జి దగ్గర పంట పొలాల్లో కరెంటోల్ల నిర్లక్ష్యం వల్ల రైతులు చాలా ఇక్కట్ల పాలవుతున్నారు,చెకల్ల సబ్ స్టేషన్ వెలుగొండ ఫీడర్ సంబంధించిన కరెంట్ లైన్ మూడు సంవత్సరాల నుండి కరెంటు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా త్రీఫేస్ కరెంట్ క్రింద పోల్ ఏసి సర్వీస్ వైర్లను పైకిలేపి మాకు కరెంటు ప్రమాదం లేకుండా సౌకర్యం కల్పించమని ఎన్నిసార్లు చెప్పినా పెడచెవునబెట్టి పట్టించుకోవడం లేదు.
త్రి ఫేస్ కరెంటు వైర్లు మాకు చేతులు అందే విధంగా ఉండటం వల్లవరి పొలం కోసే సమయములో కూడా హార్వెస్టర్లు కూడా నడవలేని పరిస్థితి ఎదురవుతున్నది అని రైతులు ఆందోళన చెందుతున్నారు.