ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా పెరుగుతున్న ఉల్లి ధరలు.. కేంద్రం మాస్టర్ స్కెచ్

national |  Suryaa Desk  | Published : Tue, Sep 24, 2024, 12:28 AM

 దేశంలో ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇది వరకే.. సేకరించి ముందస్తుగా నిల్వ చేసిన స్టాక్‌ను (బఫర్ స్టాక్) కేంద్రం ఇప్పుడు హోల్‌సేల్ మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయించింది. ఉల్లి ఎగుమతులపై కేంద్రం ఇటీవల ఆంక్షలు తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో దేశీయంగా ఒక్కసారిగా రిటైల్ మార్కెట్లో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. దీంతో కేంద్రం దిగొచ్చింది. ఢిల్లీ సహా మరికొన్ని ప్రధాన నగరాల హోల్ సేల్ మార్కెట్లోకి బఫర్ స్టాక్ విడుదల చేయాలని నిర్ణయించినట్లు వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెక్రటరీ నిధి ఖరే సోమవారం రోజు తెలిపారు. భారత్ వ్యాప్తంగా రాయితీ ఉల్లిని రిటైల్‌లో విక్రయించే యోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు.


'కొద్దిరోజుల కిందట ఎగుమతుల సుంకం ఎత్తివేసిన నేపథ్యంలో.. ఉల్లి ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. దీంతో.. 4.7 లక్షల టన్నుల వరకు బఫర్ స్టాక్ విడుదల చేయాలని నిర్ణయించాం. దీనితో పాటు ఖరీఫ్‌లో పెరిగిన ఉల్లి విస్తీర్ణంతో.. ధరలకు కళ్లెం పడుతుందని ఆశిస్తున్నాం.' అని ఖరే తెలిపారు.ఉల్లి ఎగుమతులపై ఆంక్షల్ని తొలగిస్తూ.. కేంద్రం 10 రోజుల కిందట నిర్ణయం తీసుకుంది. టన్నుకు 550 డాలర్లుగా ఉన్న.. కనీస ఎగుమతి ధర కూడా తొలగించింది. దేశీయంగా ఉల్లి రైతులకు .. మంచి ధర దక్కాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో క్రూడ్ పామాయిల్, శుద్ధి చేసిన సన్ ఫ్లవర్ ఆయిల్‌ దిగుమతులపై సుంకం పెంచింది.


>> ఈ పరిణామాల నడుమ భారత్ వ్యాప్తంగా ఉల్లి రేట్లు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఢిల్లీలో కేజీ రూ. 55 పలుకుతుండగా.. ముంబైలో రూ. 58, చెన్నైలో రూ. 60 చొప్పున అమ్ముతున్నట్లు తెలిసిందే. ఇదే సమయంలో హైదరాబాద్‌లో పలు చోట్ల కేజీ ఉల్లి రూ. 70 కిపైనే ఉంది. ఇతర ప్రధాన నగరాల్లో కూడా ఇలాగే ఉల్లి ధరలు గరిష్ట స్థాయిల్లో ఉన్నాయి.


ఉల్లిపై ఆంక్షల్ని ఎత్తివేసినప్పటి నుంచి..ఎన్సీసీఎఫ్, నాఫెడ్ ద్వారా ఢిల్లీ సహా ఇతర రాష్ట్ర రాజధానుల్లో 35 రూపాయలకే కేజీ చొప్పున మొబైల్ వ్యాన్లతో కేజీ ఉల్లిని కేంద్రం విక్రయిస్తుంది. జాతీయ సగటు కన్నా ఉల్లి ధర ఎక్కువగా ఉన్న నగరాల్లో రాయితీ ఉల్లి అమ్మకాలు చేపట్టనున్నట్లు చెప్పారు. దేశీయ రైతులకు రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతోనే వంట నూనెలపైనా దిగుమతుల సుంకం పెంచినట్లు తెలిపారు. టమాటా ధరల్ని కూడా ఎప్పటికప్పుడు తాము గమనిస్తున్నామని.. అవసరమైతే జోక్యం చేసుకుంటామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com