ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇజ్రాయేల్ దాడుల్లో హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్ హతం

international |  Suryaa Desk  | Published : Tue, Sep 24, 2024, 12:24 AM

మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లో పలు దేశాల అధినేతలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వీరిలో పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ కూడా ఉన్నారు. అబ్బాస్‌తో సమావేశమైన మోదీ.. గాజాలో చోటుచేసుకుంటున్న దయనీయ మానవతా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో శాంతి, సుస్థిరతను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు భారత్‌ ఎల్లప్పుడూ మద్దతు అందిస్తుందని తెలిపారు.


అయితే, ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయేల్ అన్యాయంగా చేస్తున్న దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో చేసిన తీర్మానానికి భారత్ గైర్హాజరైన కొన్నిరోజుల్లోనే ప్రధాని మోదీ.. పాలస్తీనా అధ్యక్షుడితో సమావేశం కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 193 సభ్యదేశాలతో కూడిన ఐరాస జనరల్ అసెంబ్లీ.. పాలస్తీనాకు మద్దతుగా తీసుకొచ్చిన ఈ తీర్మానానికి 124 సభ్య దేశాలు అనుకూలంగా ఓటేశాయి. 14 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేయగా.. 43 దేశాలు గైర్హాజరయ్యాయి. వీటిలో ఇండియా కూడా ఒకటి.


ఇజ్రాయేల్, గాజాలోని ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య దాదాపు ఏడాది నుంచి యుద్ధం నడుస్తోంది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయేల్‌పై వేలాది రాకెట్లతో మెరుపు దాడికి పాల్పడిన హమాస్.. సరిహద్దుల నుంచి ప్రవేశించిన సుమారు 1200 మందిని హతమార్చింది. వందలాది మందిని బందీలుగా చేసుకుంది. ఈ దాడి అనంతరం ఇజ్రాయిల్ కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. పాలస్తీనాలో మిలటరీ ఆపరేషన్ చేపట్టింది. ఈ దాడుల్లో 41 వేలకు పైగా పాలస్తీనా ప్రజలు మరణించినట్టు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది.


ఇదిలా ఉంటే, అక్టోబర్‌ 7 దాడుల వ్యూహకర్త, హమాస్‌ చీఫ్‌ యాహ్యా సిన్వార్‌ మృతి చెందినట్లు ఇజ్రాయేల్‌ దళాలు అనుమానిస్తున్నాయి. సుదీర్ఘకాలంగా అతడి కదలికలు లేకపోవడంతో ఆ దేశ భద్రతా దళాలు అతడు సజీవంగా ఉండి ఉండకపోవచ్చని భావిస్తున్నాయి. కానీ, ఈ వాదనను బలపర్చే ఆధారాలేవీ వారి వద్ద లేవు. ఇజ్రాయేల్‌లోని పలు మీడియా సంస్థలు మాత్రం సిన్వార్‌ చనిపోయినట్లు కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇజ్రాయెల్‌ మిలటరీ ఇంటెలిజెన్స్‌ డైరెక్టరేట్‌ కూడా ఒకవేళ సిన్వార్‌ చనిపోయినా.. ఇప్పటివరకు బలపర్చే ఎటువంటి ఆధారాలు తమకు లభించలేదని చెబుతున్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఆగస్టు మొదటివారంలో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యకు గురైన తర్వాత.. తమ నేతగా సిన్వార్‌ను ప్రకటించారు. కానీ, ఆయన కూడా ఇజ్రాయేల్ దాడులో చనిపోయినట్టు కథనాలు రావడంతో వారికి పెద్ద ఎదురుదెబ్బే.


కాగా, హమాస్‌ సొరంగాల వ్యవస్థను ఇజ్రాయేల్‌ సైన్యం తీవ్రంగా దెబ్బతీసింది. వీటిల్లో సిన్వార్‌ ఉన్నట్లు అనుమానించిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇటీవల సెంట్రల్‌ గాజాలోని హమాస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌పై వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో సమీపంలోని పాఠశాల కూడా ధ్వంసమైంది. ఈ దాడిలో 22మంది మృతి చెందినట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ మృతుల్లో హమాస్‌ అధినేత ఉండొచ్చని ఇజ్రాయెల్‌ దళాలు అనుమానిస్తున్నాయి. ప్రస్తుతం సిన్వార్‌ మరణంపై ఇజ్రాయెల్‌ దళాలు దర్యాప్తు చేస్తున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com