గ్రేటర్ హైదరాబాద్లో భారీగా వర్షం పడుతున్నది. రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నదాయి. దీంతో జంట జలాశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది.మూసీ నదికి వరద పోటెత్తింది. మూసారంబాగ్ బ్రిడ్జిని తాకుతూ వరద ప్రవహిస్తున్నది. హుస్సేన్ సాగర్లోకి పెద్దఎత్తున వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.వరద పరిస్థితిపై జీహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖ తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. 040-2111 1111, డీఆర్ఎఫ్ నంబర్ 90001 13667 లో సంప్రదించాలని సూచించారు.