ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ ఇంటికి హైడ్రా నోటీసులు అంటూ వస్తున్న ఫేక్ న్యూస్ పై వివరణ ఇచ్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 31, 2024, 03:18 PM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సైతం హైడ్రా నోటీసులు ఇచ్చిందని జోరుగా తప్పుడు ప్రచారం జరుగుతోంది.హైద్రాబాద్ లోని జగన్ లోటస్ పాండ్ FTL పరిధిలోనే ఉందని. త్వరలోనే హైడ్రా లోటస్ పాండ్ కూల్చేస్తోందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వైఎస్ జగన్ కు నోటీసులు ఇచ్చినట్లు వస్తోన్న వార్తలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికు హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు.జగన్ హైడ్రా నోటీసులు ఇచ్చినట్లు సోషల్ మీడియలో జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారామని దానిని ఎవరూ నమ్మొదని సూచించారు. హైడ్రా ఇట్లాంటి నోటీసులు ఇవ్వదని అక్రమం అని నిర్ధారించుకుంటే నేరుగా వెళ్లి కూల్చేస్తుంది అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com