రంగయ్యచెరువు రీడిజైన్ పేరుతో చుట్టూ ఉన్న గ్రామాలను ముంచే కుట్ర చేస్తున్న ఎమ్మెల్యే మాదవరెడ్డి అంటూ ఆరోపిస్తున్న గ్రామస్థులు.నిన్న సమీక్షలో మాదవరెడ్డి వాఖ్యల పట్ల గ్రామాల ప్రజల తీవ్ర ఆగ్రహం నమ్మి ఓటేస్తే మా ఊర్లను ముంచుతున్నాడంటూ ఆగ్రహం .రంగయ్య చెరువు రిజర్వాయర్తో మేడపల్లి, లక్ష్మీతండా, ఆసరవెల్లి, లైన్ తండా, కొండాపురం, మూడు చెక్కల్, గోవిందాపురం, ఎర్ర చెరువు తండా, మొత్తం ఖాళీ కావాల్సిన పరిస్థితి. అంతే కాకుండా వేల ఎకరాల భూమి ముంపునకు గురైయ్యి రోడ్డున పడాల్సిన వస్తుందని గ్రామస్తుల ఆందోళన.అన్ని గ్రామాలు డిమాండ్ చేస్తూ రిజర్వాయర్ రీ డిజైన్ ఆలోచనను విరమించుకోవాలని రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్.రైతులు ఆలోచనకు తగ్గట్టుగా లేకుండా ముందుకు వెళ్లి రిజర్వాయర్ శాంక్షన్ చేయించే ప్రయత్నం చేస్తే మరో ఉద్యమానికి నాంది పలుకుతామని, ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని ఆ గ్రామ ప్రజలు డిమాండ్ చేసారు.. రిజర్వాయర్ ఆలోచనలు మానుకునే వరకు పోరాటం చేస్తామని చెప్పారు.
మా గ్రామాల జోలికి వస్తే ఊరుకోం.. ఖబర్దార్ కాంగ్రెస్.. మీ కాంట్రాక్టర్ పనుల కోసం మా ఊళ్లను ముంచుతారా అంటూ మండి పడ్డ గ్రామ ప్రజలు.
మా శవాల మీదే రిజర్వాయర్ నిర్మించాలి లేదా రిజర్వాయర్ నిర్మాణ ఆలోచనను తక్షణం ఉపసంహరించుకోవాలని గ్రామ ప్రజలు అన్నారు.