కృతికా నక్షత్రం సందర్భంగా మంగళవారం కరీంనగర్ మండలం నగునూర్ గ్రామంలోని పరివార సమేత దుర్గాభవానీ దేవాలయంలో కొలువై ఉన్న ఉమాసుతుడైన శ్రీ వల్లిదేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మాధికారి వేదపండితులు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో విశేష అభిషేకం, ఫలపంచామృతాభిషేకం, విశేష హారతి నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గోన్నారు.