కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మంగళవారం రైతులకు రెండవ విడత రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికీ బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు బాన్సువాడ పట్టణంలోని పోచారం నివాసంలో పాలాభిషేకం చేసారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయనిధి పథకం 187మంది లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను పోచారం పంపిణీ చేసారు.