ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీజేపీ ఓబిసి మోర్చ ఆధ్వర్యంలో నారాయణపేట కలెక్టరేట్ ముందు ధర్నా మంగళవారం నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ అధికారికి వినతి పత్రం అందించారు. జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని, కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎంబీసీ కులాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు.