తమ డిమాండ్ల సాధన కోసం అసెంబ్లీ ముట్టడికి వెళుతున్న గ్రామపంచాయతీ కార్మికులను నారాయణపేట జిల్లా కృష్ణ మండల కేంద్రంలో పోలీసులు మంగళవారం అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. పంచాయతీ కార్మికులు మాట్లాడుతూ ప్రభుత్వం తమను పర్మనెంట్ చేసి ఆరు నెలల వేతనాలు వెంటనే విడుదల చేయాలన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం నిరసనను తెలియజేయడానికి వెళుతున్న వారిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం సరైంది కాదన్నారు.