ఆదివారం మీరాలం మండి శ్రీమహాంకాళేశ్వర అమ్మవారికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రజలు సుభిక్షంగా జీవించేలా ఆశీస్సులు కలకాలం కొనసాగాలని ఆకాంక్షించారు.