దామరగిద్ద మండలం ఆశన్ పల్లి గ్రామ శివారులో ఆదివారం ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఇదే గ్రామానికి చెందిన ఎరుకలి రాములు (53) అక్కడికక్కడే మృతి చెందాడు. బస్ డ్రైవర్ అజాగ్రత్తగా వేగంగా నడపడంతో ప్రమాదం జరిగిందని స్థానిక తెలిపారు. రాములు గ్రామ పంచాయతీ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఇద్దరు అమ్మాయిలు వున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.