ఆగష్టు 6, 7 న రెండు రోజుల పాటు డిల్లీలో జరిగే దీక్షను విజయవంతం చేయాలని టీ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బాలరాజు అన్నారు. ఆదివారం మరికల్ మండల కేంద్రంలో హలో మాదిగ చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను విడుదల చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే దీక్షకు పెద్ద సంఖ్యలో మాదిగలు తరలి రావాలని అన్నారు. రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం చేస్తామని అన్నారు. నాయకులు పాల్గొన్నారు.