ఆషాడ అష్టమి పురస్కరించుకొని ఆదివారం మిర్యాలగూడ రైల్వే కాలనీ శ్రీ సాయిదత్తఆశ్రమంలో శ్రీ అనగాష్టమి సామూహికవ్రతములను భక్తులు ఘనంగా నిర్వహించారు. నాగసాయి, దత్తాత్రేయ విగ్రహాలకు అభిషేకపూజలఅనంతరం భక్తుల సామూహిక వ్రతములు చేశారు. కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు గుండా శ్రీనివాస్, నరేందర్, మట్టయ్య సోమన్న, సత్యనారాయణ, జగన్నాధ రావు, జానకిరాముడు తదితరులు పాల్గొన్నారు.