కొండమల్లెపల్లి: సెంట్రింగ్ సామాన్ దొంగతనం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై రాంమూర్తి తెలిపిన వివరాల ప్రకారం శనివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా సెంట్రింగ్ బాక్సులతో కూడిన ట్రాలీ ఆటో పట్టుబడిందని, సైదాబాద్ కు చెందిన ఆటో డ్రైవర్ చిన్న లక్షన్నర రూపాయల విలువ చేసే వీటిని చోరీ చేసి హైదరాబాద్ తరలిస్తున్నాడని, ఆటోను స్వాదీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు పంపినట్లు ఎస్సై తెలిపారు.