కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 25న తెలంగాణకు రానున్నారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 11.45 గంటలకు సిద్దిపేట చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక్కడ గంటపాటు బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1.45 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి తిరుగు ప్రయాణమవుతారు. భోజన విరామం తర్వాత బేగంపేట నుంచి 2.15 గంటలకు భువనేశ్వర్కు బయలుదేరుతారు.