ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఎన్నికలకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. టీఎస్‌ఆర్టీసీ స్పెషల్ బస్సులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 23, 2024, 07:55 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. ఏపీలో పార్లమెంట్‍, అసెంబ్లీ ఎన్నికలు జరగుతుండగా.. తెంలగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం నామినేషన్ల పర్వం నడుస్తోండగా.. వచ్చేనెల 13న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఏపీకి చెందిన చాలా మంది ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చారు. పై చదువులు చదవే విద్యార్థులు మెుదలుకొని ఐటీ ఉద్యోగులు, వ్యాపారాలు చేసుకునేందుకు చాలా మంది ఏపీవాసులు హైదారాబాద్‌కు వచ్చారు.


అయితే వీరంతా ఓటేసేందుకు స్వస్థలాకు పయనం అవుతున్నారు. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఓట్ల పండగకు స్వగ్రామాలకు వెళ్లేందుకు డిసైడ్ అవుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నారు. ప్రస్తుతం ఏపీకి వెళ్లే ట్రైన్లు మెుత్తం మే 11, 12,13 తేదీల్లో రిజర్వ్ అయినట్లు తెలిసింది. చాలా మంది ముందస్తుగానే రిజర్వ్ చేసుకున్నారు. ఇంకొందరు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను కూడా బుక్ చేసుకున్నారు.


ఈ క్రమంలో ఏపీ ఓటర్లకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయంలో ఏపీకి అదనంగా బస్సులు నడిపించాలని నిర్ణయించింది. మే 13న ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా.. దీనికి ముందు 11, 12 శని, ఆదివారాలు కావడంతో టికెట్ల బుకింగ్‌కు డిమాండ్‌ ఏర్పడింది. దీంతో తొలి దశలో కనీసం 50 ప్రత్యేక బస్సుల్ని రిజర్వేషన్‌లో పెట్టాలని, మరిన్ని ప్రత్యేక బస్సులు నడపాలని టీఎస్‌ఆర్టీసీ భావిస్తోంది. ఆర్టీసీ నిర్ణయం పట్ల ఏపీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com