వేంసూర్ మండలం వేంసూర్ గ్రామంలోని శ్రీమహాలక్ష్మీ అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమం మంగళవారం వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. వార్షికోత్సవానికి చుట్టుపక్కల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.