హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం పరిగి పట్టణంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. స్వామివారి కరుణ కటాక్షాలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ అశోక్, మార్కెట్ మాజీ చైర్మన్ సురేందర్, సీనియర్ నాయకుడు ప్రవీణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.