యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహా స్వామి వారికి భక్తుల కానుక రూపంలో వచ్చిన నెల రోజుల ఆలయ హుండీ లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభించినట్లు ఆలయ EO భాస్కర్ రావు తెలిపారు. హుండీ లెక్కింపును కొండ కింద సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో అధికారులు, భద్రత సిబ్బంది పర్యవేక్షణలో ఆలయ సిబ్బందిచే ప్రారంభించారు. సాయంత్రం లెక్కింపు అనంతరం హుండీ ఆదాయం వెల్లడిస్తామని తెలిపారు.