మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన పగరపు బిక్షపతి అనే వ్యక్తి ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి మృతి చెందాడు. కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మృతుడు సోమవారం ఇంటి సమీపంలోని డ్రైనేజీ మోరిపై కూర్చుని ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. తలకు తీవ్రగాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.