గండ్ర దామోదర్ మరియు అతని అనుచరులను గతంలోనే టీబీజీకేఎస్ నుండి తొలగించామని స్టీరింగ్ కమిటీ బాధ్యులు నూనె కొమురయ్య, వడ్డేపల్లి శంకర్, పర్లపల్లి రవి వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. దామోదర్ రావు కార్మిక వర్గాన్ని తప్పుదోవ పట్టించడం సరికాదని అన్నారు. సింగరేణిలో జరిగిన ఎన్నికల తర్వాత ఇలాంటి వారిని సంఘం తొలగించిందని టీబీజీకేఎస్ కు గండ్రకు సంబంధం లేదని వెల్లడించారు.