18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు తన ఓటును నిజాయితీగా వేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న రాశి వనంలో మంగళవారం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్విఫ్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ ప్రతిజ్ఞ నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హాజరయ్యారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని తెలిపారు. అనంతరం సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటో దిగారు.