జిల్లాలోని పలు ప్రాంతాలలో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియడంతో జనం ఇబ్బంది పడ్డారు. జిల్లా కేంద్రంలో భారీ వర్షంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కామారెడ్డి, లింగంపేట్, మాచారెడ్డి, దోమకొండ, నిజాంసాగర్, పిట్లం, రామారెడ్డి తదితర మండలాలలో వర్షంతో రైతులకు నష్టం వాటిల్లింది. వరద నీటిలో ధాన్యం కొట్టుకుపోయి మరింత నష్టం వాటిల్లింది.